Saturday, 23 May 2026

Blog

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 23వ రోజుకు చేరిన దీక్షలు 

  (గూడూరు పున్నమి ప్రతినిధి) :  స్థానిక పెద్ద మశీదు ఎదుట నల్ల చట్టాలకు నిరసనగా చేపట్టిన దీక్షలు ఆదివారం 23వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం దీక్షలో 20 మంది ముస్లిం, హిందూ సోదరులుకూర్ఛున్నారు. ఈ సందర్భంగా దీక్షల్లో కూర్చున్న మై ఫ్రెండ్స్ అసోసియేషన్ అధ్యక్షులు  షేక్ రాహుల్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రజలు నల్ల చట్టాలపై ఒక అవగాహనకు వచ్చారన్నారు. కేవలంముస్లింలు మాత్రమే కాకుండా ఈ చట్టాలతో దేశంలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలందరూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.లౌకిక దేశంగా గొప్ప ప్రజాస్వామ్య వ్య్వవస్థ గా  పేరుకలిగిన భారతదేశం నేడు ఈ నల్ల చట్టాల వలన తలదించుకొనే పరిస్థితి వచిందని రాహుల్  ఆవేదన వెలిబుచ్చారు.అన్నదమ్ముల వలె కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తున్న ప్రజలలో అభద్రతా భావంఏర్పడిందని దీన్ని తొలగించాల్సిన అవసరం ఉందని దీనికి ప్రజలందరు ఒకేతాటిపై నడిచి ఈ నల్ల చట్టాలను రూపుమాపాలని కోరారు.     మైనారిటీ నాయకులు ముజాహిద్ మాట్లాడుతూ దేశంలోపుట్టి పెరిగిన వారు దేశ పౌరులుగా నిరూపించుకునే దౌర్భాగ్యం మరే దేశంలోనూ లేదన్నారు. కేవలం హిందూత్వను అమలు చేయాలనే ఏకైక లక్ష్యంతో నల్ల చట్టాలు తీసుకువచ్చారని బీజేపీప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్ఆర్సీ సీఏఏ,  ఎన్పిఆర్ లను రద్దుచేసేంత వరకు  శాంతియుత నిరసన పోరాటాలను ఆపేది లేదన్నారు. ఈ దీక్షలో మన్సూర్, కలీం, హరీ, శ్రీకాంత్, సాధిక్, ఈశ్వర్, షాహిద్, ఫారూఖ్, జునేద్, యశ్వంత్, దావూద్, సాయి, ఇనాముల్, షఫీ మౌలానా, మాబాష, జవాద్ తో పాటు  భారత లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్ గూడూరు

గోడ కట్టారు గేటు మరిచారు

గోడ కట్టారు గేటు మరిచారు అసాంఘిక కార్యకలాపాలకు నిలయమైన పాఠశాల ఆవరణం పట్టించుకోని అధికారులు గూడూరు పున్నమి ప్రతినిధి. గూడూరు పట్టణంలోని 7 వార్డు మునిసిపల్ ప్రాధమిక పాఠశాలకు సంబంధించి కొన్ని దశాబ్దాల  తర్వాత ఇటీవల గోడను కట్టడం జరిగింది. తర్వాత .ఏమైందో తెలియదు కాని గోడకు సంబంధించి సిమెంటు పూతను వేయలేదు సరికదా గేటును కూడా  పెట్టకుండా వదిలివేశారు. దీంతో అక్కడ రోజూ మందుబాబులు రాత్రుళ్ళు జల్సా చేయడం కొంతమంది దీన్ని బహిర్భూమిగా వాడుకోవటం పరిపాటి అయింది. చీకటి  కార్యకలాపాలకు నిలయంగా మారడంతో పాఠశాల ఆవరణాన్ని ప్రతిరోజూ విద్యార్థులు, టీచర్లు శుభ్రం చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మునిసిపల్ ఆఫీసుకు కూతవేటు దూరంలో, శివాలయంకు పక్కనే ఉన్న ఈ పాఠశాల వెంబడి కొన్ని వందలమంది రాకపోకలు చేస్తుంటారు.ఎవరూ పట్టించుకొనే పాపాన పోరు. ఇక అధికారులు సైతం ఈ దారినే వెళుతూ కూడా పట్టించుకోకపోవడం దారుణమని  స్థానికులు వాపోయారు. ఇకనైనా మునిసిపాలిటీ కమీషనర్ గారు కలుగ చేసుకొని సదరు పాఠశాలకు గేటును మంజూరు చేయవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీని సందర్శించిన ట్రైనీ ఐఏఎస్ ల బృందం

పంజాబ్ క్యాడర్ కు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు తమ స్టడీ టూర్ లో భాగంగా శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ సీనియర్ అధికారి ఎస్.పి.శర్మ వీరికి సాదర స్వాగతం పలికి, పారిశ్రామిక ప్రగతి, మౌలిక వసతులు, ప్రత్యేకతలను వారికి వివరించారు.  శ్రీ సిటీ పట్ల ఎంతో ఆకర్షితులైన ఐఏఎస్ అధికారులు, ఇక్కడ  ప్రణాళిక, అమలు, స్థిరమైన పట్టణీకరణ సూత్రాలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలు చాలా అద్భుతంగా ఉందంటూ  వ్యాఖ్యానించారు. శ్రీసిటీ పరిసరాలు చుట్టిచూడడంతో పాటు, రాక్ వర్త్ పరిశ్రమను వీరు సందర్శించి ఉత్పత్తులను, కార్మికుల పనితీరును పరిశీలించారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఫ్రెండ్స్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్

రాపూరు లో టైలర్స్ డే సందర్భంగా ఫ్రెండ్స్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి టైలర్ల సమస్యలపై నిరుపేద టైలర్ లని ఆదుకోవాలని స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో మండల రెవెన్యూ ఆఫీసర్ శాంతకుమారి కి వినతి పత్రం అందజేసినారు ఈ కార్యక్రమంలో రియాజ్ భాషా, ముబారక్, ఖాదర్ భాషా, మహేష్ తదితర టైలర్లు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన

రాపూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించారు ఈ ప్రదర్శనలో విద్యార్థులు సైన్స్ కి సంబంధించిన ఎన్నో ప్రయోగాలు నిర్వహించి ప్రదర్శనలు ఇచ్చి చూపరులను అబ్బుర పరచడం జరిగినది ఇందులో భాగంగా కే.గంగాధర్ 9వ తరగతి విద్యార్థి తన ఉపాధ్యాయుడు N.మునికృష్ణ సహాయ సహకారాలతో ఏర్పాటుచేసిన ఆటోమేటిక్ ఇరిగేషన్ యూజింగ్ సాయిల్ మాయిశ్చర్ సిస్టం నీటి పొదుపు కరెంటు ఉత్పత్తి ప్రయోగానికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక చేయబడినది ఉపాధ్యాయులు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు మరియు వివిధ పాఠశాల విద్యార్థులు ప్రదర్శనలు తిలకించి సైన్స్ పట్ల ఆసక్తి ఏర్పడిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీన్ వర్క్ షాప్

రాపూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జిల్లా త్రాగునీటి సరఫరా మరియు పారిశుధ్య కమిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీన్ కార్యక్రమంలో భాగంగా రాపూరు, కలువాయి, సైదాపురం మండలాల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారుR.W.S DE B. మోహన్ రావు మాట్లాడుతూ మండలంలో పెండింగ్లో ఉన్నటువంటి మరుగుదొడ్లు నిర్మాణం కార్యక్రమంపై వర్క్ షాప్ నిర్వహించడం ద్వారా గ్రామాలలో LOB( మరుగుదొడ్లు నిర్మించి సగంలో ఆగిపోయినవి) NLOB( కొత్తగా వాలంటీర్లు సర్వే నిర్వహించి నిర్మించవలసినవి) వీటిపై అవగాహన బయోమెట్రిక్ ద్వారా ఆన్లైన్లో పొందుపరచడం నిర్మాణానికి అయ్యే వేయాల కి సంబంధించి వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలోMPTO ఆమోస్ బాబు,AE ఆంజనేయులు, పురుషోత్తం, అజీమ్ స్వచ్ ఆంధ్ర కమిషన్ కన్సల్టెంట్ మహేష్,ఈ.ఓ.పి.ఆర్. డి గంగయ్య, తదితరులు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

యువజన సంఘాల అభివృద్ధి కార్యక్రమం

రాపూరు డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యువజన సంఘాల అభివృద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమంలో యూత్ క్లబ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ని ఏర్పాటు చేసి D.Y.C మహేంద్ర రెడ్డి మాట్లాడుతూ యువత స్పోర్ట్స్ పట్ల ఆసక్తి చూపాలని ఫిట్ నెస్ ని డెవలప్మెంట్ చేసుకొని ఆటలలో బాగా రాణించాలని పలు సూచనలు సలహాలు ఇచ్చి కళాశాలకు కావలసిన స్పోర్ట్స్ కి అవసరమైన ఆటవస్తువులు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శివరామయ్య వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, కిషోర్ మరియు యువ కేంద్రం అధ్యక్షులు శివ, కోటేశ్వరరావు, బాలాజీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

Featured ఆంధ్రప్రదేశ్

నెల్లూరు ఎంపీ ని కలిసిన ఉదయగిరి ఎమ్మెల్యే

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మంగళవారం ఆయన స్వగృహంలో కలిశారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ సమస్యలను ఆయనకు నివేదించారు. ఒక అరగంట పాటు వారి మధ్య సమావేశం జరిగింది. విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి కూడా పాల్గొన్నారు.

Featured ఆంధ్రప్రదేశ్

ఆర్టిసి రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఎంపీకి వినతి

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు మంగళవారం సాయంత్రం ఆయన నివాసంలో కలిసి ఒక వినతిపత్రాన్ని అందజేశారు తాము రిటైర్ అయినప్పటికీ నామమాత్రపు పెన్షన్ మాత్రమే పొందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు అది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ కంటే కూడా తక్కువ అని దానితో జీవితాన్ని ఎలా గడపాలో అని ప్రశ్నించారు తమకు కనీస మొత్తం పెన్షన్ సాధించి పెట్టాలని వారు ఎంపీ కి విజ్ఞప్తి చేశారు ఆ మేరకు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సానుకూలంగా స్పందించి తన ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు

Featured ఆంధ్రప్రదేశ్

మీ నిరసనను సీఎంకు నివేదిస్తా : నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి

ఎన్ ఆర్ సి , ఎన్ పి ఆర్, సి ఏ ఏ ల పై నిరసన ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిస్తామని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నెల్లూరు ఎంపీ ని కలిసిన జేఏసీ నాయకులకు ఆయన హామీ ఇచ్చారు. నేను ఈ అంశాలపై పార్లమెంట్లో ఓటింగ్ జరిగేటప్పుడు లేనని, హైదరాబాదులో ఉన్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత 60 ఏళ్లుగా నెల్లూరు జిల్లాలో హిందూ ముస్లిం సోదరులు ఐక్యమత్యంగా ఉన్నారని తెలిపారు. ఇదే ఐక్యత, సోదరభావం కొనసాగాలన్న దే తమ అభిమతమని స్పష్టం చేశారు. ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ , సి ఏ ఏ లకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలనే డిమాండ్ ను ఆయనకు చేర వేస్తానని స్పష్టం చేశారు. ఇదివరకే మా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దీనికి వ్యతిరేకమని తన నిర్ణయాన్ని తెలియజేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అయినప్పటికీ మీ కోరిక మేరకు ఆయనకు మరొక్కసారి విషయాన్ని తెలియజేస్తానని చెప్పారు. అంతకుముందు జేఏసీ నాయకులు మౌలానా ఇలియాస్, ఆసిఫ్, జాకీర్, ఫయాజ్, జియావుల్ హక్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. ఇదే విషయాన్ని ఆయన విలేకరులకు కూడా మరొకసారి తెలియజేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.