Saturday, 23 May 2026

Blog

Featured

ముస్లింలకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

మనుబోలు17-05-2020( పున్నమి ప్రతినిధి కె-వెంకటేష్) నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలంలో ని కాగితాలపూరు, కొలనకుదురు, మనుబోలు, మడమనూరు, వీరంపల్లి గ్రామాలలో పర్యటించి, రంజాన్ కానుక పేరిట ముస్లిం కుటుంబాలకు పండుగ సరుకులను పంపిణీ చేసిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబం సంతోషంగా రంజాన్ పండుగ జరుపుకునేందుకు పండగ సరుకులను పంపిణీ చేస్తున్నాం.సర్వేపల్లి నియోజకవర్గం లోని ప్రతి ముస్లిం కుటుంబానికి అందజేయాలనే లక్ష్యంతో సుమారు 7 వేల కుటుంబాలకు పండుగ సరుకులు పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టి కొనసాగిస్తున్నాం.రేషన్ కార్డులతో సంబంధం లేకుండా గ్రామాలలో నివసించే ప్రతి ముస్లిం కుటుంబానికీ పండగ సరుకులను అందజేస్తాం. ముస్లిం కుటుంబాలు సంవత్సరకాలం పాటు ఎదురు చూసే, పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా కరోనా నేపథ్యంలో పనులు లేక పండుగ జరుపుకునే లేక పోతున్నామనే భావన కలగకూడదని పండుగ సరుకులను పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లక్ష కుటుంబాలకు పైగా *”సర్వేపల్లి రైతన్న కానుక”* పేరిట బియ్యం, వంటనూనె పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేశాం.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ముస్లిం కుటుంబాలకు విడదీయరాని సంబంధం ఉంది. ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారిది అయితే, ముస్లిం కుటుంబాలకు అండగా నిలుస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఇంటి బిడ్డగా రంజాన్ పండుగలో పాలుపంచుకునే భాగ్యం దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నా. ప్రతి ముస్లిం సోదరునికి, సోదరిమణికి ముందస్తు *”రంజాన్ శుభాకాంక్షలు”* తెలియజేస్తున్నా.సర్వేపల్లి నియోజకవర్గంలోని ప్రతి ముస్లిం కుటుంబానికి రంజాన్ పండుగ సందర్భంగా సేమియా, చక్కెర, నెయ్యి, గోధుమపిండి, వంటనూనెను పంపిణీ చేస్తున్నాము సర్వేపల్లి నియోజకవర్గం లోని 7000 కుటుంబాలకు రంజాన్ పండుగ సరుకులను అందజేస్తున్నము ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలోనే *”సర్వేపల్లి రైతన్న కానుక”* పేరిట లక్ష కుటుంబాలకు పైగా 3కోట్ల 50 లక్షల రూపాయల విలువైన బియ్యం, వంటనూనె పంపిణీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా, విజయవంతంగా పూర్తి చేశాం. సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు “ఇంటి బిడ్డగా” వ్యవహరిస్తానని మరోసారి తెలియజేసుకుంటున్నాను. సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని వర్గాలకు సేవా కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు, పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ఈకార్యక్రమంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మిరెడ్డి హరగోపాల్ రెడ్డి,చిట్టమూరు అజయ్ కుమార్ రెడ్డి, కడివేటి చంద్రశేఖర్ రెడ్డి ,ముంగర విజయ భాస్కర్ రెడ్డి,దాసరి భాస్కర్ గౌడ్, చేరెడ్డి రామిరెడ్డి,సాయి మోహన్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,వెంకటసుబ్బయ్య,దనుంజయరెడ్డి,ప్రదీప్ రెడ్డి, సుల్తాన్ సాహెబ్ మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Featured

వ్వవసాయ మార్కెట్ యాడ్ నందు బత్తాయి పండ్లను విక్రయించారు

రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు లోని స్థానిక మద్దెల మడుగు వ్వవసాయమార్కెట్ యాడ్ లో కరోనా లాక్ డౌన్ దృశ్య రాష్ట్రప్రభుత్వం రైతులు నష్టపోకూడదు అన్న భావము తో రైతులకు గిట్టుబాటు ధర కళిపిస్తూ కొనుగోలు చేసిన బత్తాయి పండ్లను వ్వవసాయ మార్కెట్ యాడ్ నందు అనిత కుమారి ఆదేశాల మేరకు 6 కిలోలు 100 రూ చొప్పున విక్రయించారు.ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగ పరచుకున్నరు.

జాతీయ అంతర్జాతీయ

షరతులతో అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు అనుమతి

పున్నమి తెలుగు దిన పత్రిక ✍ లాక్ డౌన్ 4.0 మార్గధర్మకాలను కేంద్ర విడుదల చేసింది. హాట్ స్పాట్ లలో లాక్ డౌన్ కఠనంగా అమలు చేయనుంది. రాష్టాల పరస్పర అంగీకారంతో ప్రజారవాణాకు అనుమతి ఇచ్చింది. అలాగే అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు షరతులతో కూడిన అనుమతులు జారీచేసింది. మే 31 వరకు కాలేజీలు,స్కూళ్లు ,మెట్రో,విమాన సర్వీసులు బంద్ చేసింది. హాల్స్ మాల్స్ హోటళ్లకు కూడా అనుమతి నిరాకరించింది. ఇప్పటిలాగే ఉ 7-రా. 7వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.

Featured భక్తి

హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ సుందర వీరాంజనేయ స్వామి విశేష పూజలు నిర్వహించారు

రాపూరు , మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు క్షేత్రపాలకుడు శ్రీ సుందర వీరాంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు అభిషేకం, చందనాలంకరం,ఆకుపూజ, మరియు ఆస్థాన సేవ కార్యక్రమాలు అర్చకులతో ఏకాంతంగా నిర్వహించడం జరిగింది

Featured

స్నేహ హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో లో 47 వ రోజు అన్నదానం

రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : స్నేహహస్తం హస్తం పౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా సందర్భంగా జరుగుతున్న 47 వ అన్నదానానికి Sd.ఆసిఫ్, జిల్లా వోక్ఫ్ బోర్డు డైరెక్టర్ (వైయస్ అర్ సిపి) నాయకులు 500 మంది పేద గిరిజనులకు అన్నదానం కి విరాళం స్నేహ హస్తం ఫౌండేషన్ వారికి ఇవ్వడం జరిగింది వారి సహాయ సహకారాలతో పేద గిరిజనులకు అన్నదానం చేయడం జరిగింది. Sd.ఆసిఫ్ గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తు ఈ అన్నదాన కార్యక్రమం లాక్డౌన్ ఉన్నన్ని రోజులు జరపమని మా వెన్నంటి ఉంటూ అమూల్యమైన సలహాలు సూచనలు ఇస్తున్న శ్రీ బండి వేణుగోపాల్ రెడ్డి గారికి స్నేహ హస్తం ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Featured

రాపూరు మండలాన్ని అభివృద్ధి చేయడమే నాధేయం

రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : రాపూరు మండలంలోని ప్రజలు ఎవరూ అధైర్యపడకండి..నేనున్నా అంటూ భరోసా కల్పిస్తూ నిత్యం ప్రజా సేవకుడిగా ఏమి ఆశించకుండా తన తండ్రి ఆశయ సాధన కోసం నిరంతరం మండల ప్రజల బాగోగులు చూసుకునే మనసున్న మా రాజు రాపూరు మాజీ ఎంపీపీ మండల వైకాపా కన్వీనర్ దివంగత మహానేత బండి క్రిష్ణారెడ్డిగారి కుమారుడు బండి వేణుగోపాల్ రెడ్డి తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ప్రజల హృదయాల్లో స్థానాన్ని పొందుతున్నారు.కరోనా లాక్ డౌన్ లో మండలంలోని 25 వేల కుటుంబాలకు కూరగాయలు, పండ్లు,గుడ్లు పంపిణీ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన ఆయన ఆదివారం రాపూరు మండలంలోని నాగావారిపల్లి గ్రామంలోని ప్రజలు మంచినీటిి కోసం ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న ఆయన వెంటనే స్పందించి తన సొంత నిధులు 4 లక్షల వ్యయంతో వాటర్ ప్లాంట్ కు పెంచలకోన దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ బొడ్డు కృష్ణరెడ్డితో కలిసి భూమిపూజ కార్యక్రమం చేశారు.దీన్ని 30 రోజుల్లో పూర్తి చేసి నాగావారిపల్లి ప్రజలకు శుద్ధిజలం అందిస్తామన్నారు.అలాగే మండలంలోని అకిలి వలసలో ప్రయాణికుల కోసం బండి వేణుగోపాల్ రెడ్డి సొంత నిధులు 2 లక్షల రూపాయలతో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించనున్న ప్రయాణికులు సముదాయాన్నికి విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిఈఈ కంబాల రవీంద్ర బాబుతో కలిసి భూమిపూజ చేశారు.త్వరలో వీటి నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తామన్నారు.నా మండల ప్రజల శ్రేయస్సు కోసం ఎప్పుడు ఏమి కావాలన్న చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.మండలంలో పార్టీలకు అతీతంగా సేవ చేస్తున్నామని,ఎవరికి ఏ ఆపదవచ్చినా నన్ను సంప్రదిస్తే నా చేతనైన సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు నెల్లూరు మధుసూదన రెడ్డి,కసుమూరు రామసుబ్బారెడ్డి, బండి శ్రీనివాసులు రెడ్డి,లక్కకుల శ్రీరాములు, యూటీఎఫ్ నాయకులు పింగాణీ హరిప్రసాద్ రెడ్డి,రాపూరు శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Featured చిత్తూరు

పిడుగుపాటుకు రైతు మృతి…

రాపూరు, మే 17, 2020( పున్నమి ప్రతినిధి – ఎస్.కార్తీక్ రెడ్డి) : చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం మహాదేవమంగళం గ్రామానికి చెందిన రామిరెడ్డి కుమారుడు కే వెంకటేశ్వర రెడ్డి (60) ఆదివారం సాయంత్రం పడిన అకాల వర్షం సమయంలో గ్రామానికి సమీపంలో ఉన్న తన చెఱకు గానుగ షెడ్డు వద్ద ఉన్న కొబ్బరి చెట్టు మీద పిడుగు పడి పూర్తిగా కాలిపోయి ప్రక్కనే వున్న కే. వెంకటేశ్వర రెడ్డి అనే రైతు అక్కడికక్కడే మృతి* చెందాడు.ఇతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు.విషయం తెలుసుకున్న రెవెన్యూ మరియు పోలీసు అధికారులు దుర్ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Featured

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి*

  దూర ప్రాంతాలకు జిల్లా మీదుగా సైకిల్ మీద అలాగే కాలినడకన వెళుతున్న  వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి శిబిరాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. తదనంతరం రిజిస్ట్రార్ గారు వలస  కూలీలలకు పండ్లు , మజ్జిగ, బిస్కట్ మరియు చల్లని నీళ్ల బాటిల్స్ ను పంపిణి చేశారు. రిజిస్ట్రార్ డా. విజయ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి ఆదేశానుసారంగా మరియు జిల్లా అధికారుల అనుమతితో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ శిబిరం ద్వారా కోవిద్ -19 వ్యాధి వలన సంభవించిన విపత్కర పరిస్థితులలో  లక్షల మంది వలస కూలీలు  వందలు వేల కిలోమీటర్ల దూరం  లో వున్నా ఒడిస్సా , కలకత్తా  రాష్ట్రాలకు  వెళుతున్న వలస కూలీలకు విశ్వవిద్యాలయము తరపున కొంత చేయూత నివ్వటానికి ముందుకు వండని అన్నారు. వలస కూలీల కోసం  ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న కార్యక్రమాలకు, తమంతు సాయంగా ఉడతా భక్తి తో తాము చేస్తున్నామన్నారు. ఈ శిభిరం ఏర్పాటు చేయటానికి నిరంతరం శ్రమిస్తున్న హెల్ప్ ది నీడి  టీం ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యమంలో  కొప్పవరపు హరినాథ్ గారు సురేష్ హెరర్స్ యాజమాన్యం,  NSS  సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, డా, మధుమతి, డా చెంచు రెడ్డి, పీఆర్వో డా కోట మణికంఠ , హెల్ప్ ది నిడి టీం సభ్యులు పార్ధసారధి, రాజేష్, అఖిల్ , చైతన్య , జూనియర్ అఖిల్ మరియు డ్రైవర్ సాగర్ పాల్గొన్నారు.

Featured

*విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి*

దూర ప్రాంతాలకు జిల్లా మీదుగా సైకిల్ మీద అలాగే కాలినడకన వెళుతున్న  వలసకూలీలలకు సహాయార్ధం ఉచిత ఆహార మరియు మంచినీటి పంపిణి శిబిరాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభించారు. తదనంతరం రిజిస్ట్రార్ గారు వలస  కూలీలలకు పండ్లు , మజ్జిగ, బిస్కట్ మరియు చల్లని నీళ్ల బాటిల్స్ ను పంపిణి చేశారు. రిజిస్ట్రార్ డా. విజయ కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారి ఆదేశానుసారంగా మరియు జిల్లా అధికారుల అనుమతితో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఈ శిబిరం ద్వారా కోవిద్ -19 వ్యాధి వలన సంభవించిన విపత్కర పరిస్థితులలో  లక్షల మంది వలస కూలీలు  వందలు వేల కిలోమీటర్ల దూరం  లో వున్నా ఒడిస్సా , కలకత్తా  రాష్ట్రాలకు  వెళుతున్న వలస కూలీలకు విశ్వవిద్యాలయము తరపున కొంత చేయూత నివ్వటానికి ముందుకు వండని అన్నారు. వలస కూలీల కోసం  ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న కార్యక్రమాలకు, తమంతు సాయంగా ఉడతా భక్తి తో తాము చేస్తున్నామన్నారు. ఈ శిభిరం ఏర్పాటు చేయటానికి నిరంతరం శ్రమిస్తున్న హెల్ప్ ది నీడి  టీం ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యమంలో  కొప్పవరపు హరినాథ్ గారు సురేష్ హెరర్స్ యాజమాన్యం,  NSS  సమన్వయకర్త డా. ఉదయ్ శంకర్ అల్లం, డా, మధుమతి, డా చెంచు రెడ్డి, పీఆర్వో డా కోట మణికంఠ , హెల్ప్ ది నిడి టీం సభ్యులు పార్ధసారధి, రాజేష్, అఖిల్ , చైతన్య , జూనియర్ అఖిల్ మరియు డ్రైవర్ సాగర్ పాల్గొన్నారు.

Featured

మనుబోలు జాతీయ రహదారి వెంబడి పూర్వపు విద్యార్థుల ఆధ్వర్యంలో విజిటబుల్ బిరియాని పంపిణీ

మనుబోలు 17-05-2020(పున్నమి ప్రతినిధి కె- వెంకటేష్) కరోనా లాక్డౌన్ లాంటి విపత్కర పరిస్థితులలో బిచ్చగాళ్లు ,లారీ డ్రైవర్లు,వలస కార్మికులు పస్తులు ఉండకూడదు అనే ఉద్దేశంతో మనుబోలు జడ్.పి.హెచ్.ఎస్ పదవ తరగతి పూర్వపు విద్యార్థులు (1998-1999 )అందరూ కలిసి దాదాపు 400 మందికి వెజిటబుల్ బిర్యాని ,గుడ్డు, బిస్కెట్ ప్యాకెట్ ,అరటిపండు మనుబోలు జాతీయ రహదారి వెంబడిమరియు కృష్ణపట్నం పోర్ట్ రోడ్డు మరియు వెంకటాచలం టోల్ ప్లాజా వరకూ ఆటోలో తిరుగుతూ రోడ్డు వెంబడి అందజేసినారు. పూర్వపు విద్యార్థులు మాట్లాడుతూ తమ వంతు సాయంగా అందజేయడం సంతృప్తినిచ్చింది అని తెలియజేసినారు భవిష్యత్తులో అందరం కలిసి మరిన్ని కార్యక్రమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో తమ వంతు సహాయం అందజేసిన ప్రతి ఒక్క పూర్వపు విద్యార్థులకుఅభినందనలు తెలియజేశారు .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.