Friday, 18 September 2026
  • Home  
  • కమాన్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించిన పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
- పెద్దపల్లి

కమాన్‌పూర్ జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలను సందర్శించిన పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష

విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువుపై మరింత ఏకాగ్రత సాధించేందుకు పాఠశాలల్లో నిర్వహిస్తున్న అల్పాహార కార్యక్రమం దోహదపడుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కమాన్‌పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార కార్యక్రమాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి అల్పాహారం నాణ్యత, రుచి, పరిమాణంపై వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు.ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులు అల్పాహారం తీసుకోవడం వల్ల ఆకలి సమస్య లేకుండా చదువుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పోషకాహారం అందించడం ద్వారా, విద్యార్థుల ఆరోగ్యం, అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే అల్పాహారం నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రతిరోజూ అందిస్తున్న అల్పాహారం ఎలా ఉంది, రుచిగా ఉంటుందా, పాలు లేదా రాగిజావ అందుతున్నాయా తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కార్యక్రమం మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణతో పాటు,వారి విద్యాభ్యాసానికి అవసరమైన అనుకూల వాతావరణం కల్పించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటంతో పాటు చదువుపై మరింత ఏకాగ్రత సాధించేందుకు పాఠశాలల్లో నిర్వహిస్తున్న అల్పాహార కార్యక్రమం దోహదపడుతుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శుక్రవారం కమాన్‌పూర్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న అల్పాహార కార్యక్రమాన్ని పరిశీలించి, విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి అల్పాహారం నాణ్యత, రుచి, పరిమాణంపై వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకున్నారు.ఉదయం పాఠశాలకు వచ్చే విద్యార్థులు అల్పాహారం తీసుకోవడం వల్ల ఆకలి సమస్య లేకుండా చదువుపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పోషకాహారం అందించడం ద్వారా, విద్యార్థుల ఆరోగ్యం, అభ్యసన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యార్థులకు అందించే అల్పాహారం నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ప్రతిరోజూ అందిస్తున్న అల్పాహారం ఎలా ఉంది, రుచిగా ఉంటుందా, పాలు లేదా రాగిజావ అందుతున్నాయా తదితర అంశాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నుంచి వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని కార్యక్రమం మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణతో పాటు,వారి విద్యాభ్యాసానికి అవసరమైన అనుకూల వాతావరణం కల్పించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వర్‌రావు, ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.