పెనుబల్లి/ ఖమ్మం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం మండలపాడు గ్రామానికి చెందిన పడిగల మధు లక్ష్మి దంపతుల మూడో కుమార్తె సాయి నందిని MBBSలో ఉచిత సీటు సాధించడంతో గ్రామంలో అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం గ్రామానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు సాయి నందినిని కలిసి ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి, ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఓరుగంటి రాము (బీజేపీ), ఓరుగంటి కిట్టు (తెలుగుదేశం), బి. మెహన్ రావు, బి. సత్యనారాయణ, బి. పుల్లారావు (కాంగ్రెస్), బి. మనోజ్, బి. హరి (వైసీపీ) పాల్గొని సాయి నందినికి శుభాకాంక్షలు తెలిపారు. ఆమె విజయం గ్రామంలోని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.



