పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 5 రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల కొత్త బస్టాండ్ సమీపంలో శనివారం ఉదయం ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళుతున్న ప్రైవేట్ స్కూల్ బస్సును అప్పరల్ పార్క్ బస్సు ఢీ కొట్టింది ఈ ఘటనలో స్కూల్ బస్సు అద్దాలు ధ్వంసమై పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి సమాచారం అందుకున్న సిబ్బంది గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు దర్యాప్తు చేపట్టారు



