సీతారామపురం: ఎంపీపీగా మండల అభివృద్ధికి విశేష సేవలందించిన చింతం రెడ్డి పద్మావతమ్మ సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎంపీపీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పద్మావతమ్మ కృషి చేశారని కొనియాడారు. సీతారామపురం మండల ఆఖరి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పద్మావతమ్మ సేవలను అధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశంసించారు. కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలు పాల్గొన్నారు.

ఎంపీపీ పదవికి వన్నెతెచ్చిన చింతం రెడ్డి పద్మావతమ్మ సేవలు చిరస్మరణీయం
సీతారామపురం: ఎంపీపీగా మండల అభివృద్ధికి విశేష సేవలందించిన చింతం రెడ్డి పద్మావతమ్మ సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎంపీపీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ మండలంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పద్మావతమ్మ కృషి చేశారని కొనియాడారు. సీతారామపురం మండల ఆఖరి సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పద్మావతమ్మ సేవలను అధికారులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రశంసించారు. కార్యక్రమంలో అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలు పాల్గొన్నారు.

