ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ఆదివారం ప్రసారం కానుంది. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని వివిధ అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోనున్నారు. దేశవ్యాప్తంగా సాధించిన ప్రగతి, ప్రజల విజయాలు, సామాజిక సేవా కార్యక్రమాలు, యువతకు సంబంధించిన అంశాలపై మాట్లాడే అవకాశం ఉంది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో వీక్షించాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. గ్రామాలు, పట్టణాల్లో ప్రత్యేకంగా కార్యక్రమాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల భాగస్వామ్యంతో దేశ అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రధాని వివరించనున్నారు.



