శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని దేవరాజు సురాయపల్లె హైవే రోడ్డుపై బర్రెలు పోడుచుకుంటూ పి లక్ష్మమ్మ అనే మహిళపైకి దూసుకెళ్లాయి. దీంతో ఆమె బ్రిడ్జిపై నుంచి కింద పడి కాలు విరిగి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది బాధితురాలిని సీతారామపురం పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. హైవేలపై తరచూ ఇలాంటి,ప్రమాదాలు జరుగుతున్నాయని, జాతీయ రహదారుల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సీతారామపురంలో హైవేపై పశువుల దాడి, మహిళకు తీవ్ర గాయాలు
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని దేవరాజు సురాయపల్లె హైవే రోడ్డుపై బర్రెలు పోడుచుకుంటూ పి లక్ష్మమ్మ అనే మహిళపైకి దూసుకెళ్లాయి. దీంతో ఆమె బ్రిడ్జిపై నుంచి కింద పడి కాలు విరిగి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది బాధితురాలిని సీతారామపురం పీహెచ్సీకి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉదయగిరి ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి నెల్లూరుకు తరలించారు. హైవేలపై తరచూ ఇలాంటి,ప్రమాదాలు జరుగుతున్నాయని, జాతీయ రహదారుల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

