ఉన్నదాంట్లో తిని సంతృప్తిగా ఉన్నది బాగు మధ్యతరగతి వాడికి అప్పు మొదటి ముప్పు దయచేసి అవసరానికి మించి అప్పులు చేయకండి
పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై విషాదం చోటుచేసుకుంది. తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన దంపతులు గోదావరి నదిలో దూకి గల్లంతైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వంతెనపై వారి చిన్నారిని ఉంచి దంపతులు నదిలోకి దూకినట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంఘటనాస్థలానికి చేరుకుని గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పుల పాలైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ ఇంటిని కూడా విక్రయించినట్లు స్థానికులు తెలిపారు. సుమారు రెండు నెలలుగా భీమవరంలోని డీవీడీ పిన్ని ఇంట్లో దంపతులు ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో గురువారం రాత్రి దంపతులు తమ చిన్నారితో కలిసి చించినాడ బ్రిడ్జి వద్దకు వచ్చినట్లు తెలుస్తోంది. వంతెనపై చిన్నారిని ఉంచిన అనంతరం భార్యాభర్తలు ఇద్దరూ గోదావరి నదిలోకి దూ**కినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు.


