రాజన్న సిరిసిల్ల జిల్లా ఆగస్టు 25( పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్ మండల కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో BRS పార్టీ నాయకులు మెంగని మనోహర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజీ సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య తదితర నాయకులు మనోహర్ను శాలువాతో సత్కరించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ BRS అధ్యక్షులు ఏద్దండి నర్సింహారెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షులు రాచమడుగు సంతోష్రావు, గూడూరి భరత్, యూత్ అధ్యక్షులు శీలం స్వామి, అన్వర్, కోడె శ్రీనివాస్, కొమ్మెట రాజు, పల్లె ఆనంద్, వెంకటేష్, నరేంద్రచారి, మధు, ప్రశాంత్, వార్డు సభ్యులు, BRS నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


