*తమిళనాడు తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం టెట్ నుంచి మినహాయింపు చేసే విధంగా రాబోయే అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేయాలని డిమాండ్*
*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు*
*మహబూబ్నగర్ జిల్లా తేదీ:: 25/08/ 2026*
*ఈరోజు తమిళనాడు ప్రభుత్వం వారి రాష్ట్రంలో పనిచేసే ఉపాధ్యాయుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నది అక్కడ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ గారు ఒక చారిత్రక నిర్ణయాన్ని తీసుకొని 2011 లోపల నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ పరీక్ష నుండి శాశ్వత మినహాయింపు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఆ స్ఫూర్తిని మన రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు పునరాలోచించి రాష్ట్రంలో దాదాపుగా 40 వేల మంది సీనియర్ ఉపాధ్యాయులు 2011 లోపల 2011 ముందు నియామకమైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుండి శాశ్వతమైన మినహాయింపు వచ్చే నెల మొదటి వారంలో జరగబోవు అసెంబ్లీ తీర్మానంలో చేసి శాశ్వత టెట్ మినహాయింపును కల్పించాల్సిందిగా రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్ రాష్ట్ర అధ్యక్షులు శానమోని నర్సింలు సీనియర్ నాయకులు గౌరవ సలహాదారులు గోపాల్ జీ తదితరులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే అప్పట్లోనే వాళ్ళు డీఎస్సీ ఎంపిక విధానంలో పరీక్ష రాసి మరియు ఇంటర్వ్యూలో అర్హత పొంది ఉద్యోగం సంపాదించిన వాళ్లు కాబట్టి వాళ్లను శాశ్వత టెట్ నుండి మినహాయింపు అందరికీ కల్పించే విధంగా చొరవ చూపాలని రాష్ట్ర మంత్రివర్గాన్ని మంత్రులను ఎమ్మెల్యేలను రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు డిమాండ్ చేస్తా ఉన్నది*


