ప్రముఖ పాత్రికేయుడు తామరపల్లి రాజా అకాల మరణం
పి గన్నవరం నుండి ఆగస్టు 19 ( పున్నమి ప్రతినిధి) పి గన్నవరం మండలంలో తామరపల్లి రాజా. వయస్సు 56.జర్నలిస్టుగా ఎన్డి టీవీ యూట్యూబ్ ఛానల్ నడిపించు ప్రజా సమస్యలను ప్రభుత్వానికి చేరవేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవారు వారి తండ్రి తామరపల్లి బ్రహ్మం పి గన్నవరంలో రామ స్టూడియోను నాలుగు దశాబ్దాల కాలముగా నిర్వహించారు ఆ స్టూడియోను ప్రస్తుతం రాజా స్టూడియోను నడుపుకుంటూ మంచి ప్రోటోగ్రాఫర్ గా జర్నలిస్టుగా అందరిలోనూ గుర్తింపు తెచ్చుకున్నారు ఆగస్టు 18 ఉదయం ఇంటి వద్ద విష సర్పము కాటుకు గురై అమలాపురం ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలియజేశారు రాజా కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజా అకాల మరణం పట్ల పి గన్నవరం వర్తక సంఘం వాకర్స్ క్లబ్.పి గన్నవరం జర్నలిస్టు యూనియన్.మమత స్వచ్ఛంద సేవాసమితి. రాజా అభిమానులు సంతాపం తెలియజేశారు


