కృష్ణ మండలం హిందూపూర్ గ్రామంలో బీజేవైఎం నూతన కమిటీని ఏర్పాటు చేశారు. మండల బీజేవైఎం అధ్యక్షులు వొట్టేవోళ్ళ సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉప్పారి తిరుపతిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా బి. శివకుమార్, కే. బస్వరాజు, ప్రధాన కార్యదర్శిగా డి. రమేష్, కార్యదర్శిగా సి. సచిన్, కోశాధికారిగా యూ. మహాంతేష్ను ఎంపిక చేశారు. ముఖ్యఅతిథిగా మండల బీజేపీ అధ్యక్షులు నల్లె నర్సప్ప పాల్గొని, యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని దేశభక్తితో ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా సుమారు 20 మంది యువకులు బీజేపీలో చేరారు.



