నర్సంపేటలో ఘనంగా “హర్ ఘర్ తిరంగా” ర్యాలీ
ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుదాం – డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం ఆధ్వర్యంలో “హర్ ఘర్ తిరంగా” ర్యాలీని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి *ముఖ్య అతిథిగా BJP వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ _”ఈరోజు మనం ఇక్కడ కలవడానికి కారణం ఒకటే… మన త్రివర్ణ పతాకం! ఈ జెండా కేవలం 3 రంగుల గుడ్డ కాదు. ఇందులో భగత్ సింగ్ గారి త్యాగం ఉంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పోరాటం ఉంది. స్వామి వివేకానంద స్ఫూర్తి ఉంది. ఈ జెండా కోసం లక్షల మంది ప్రాణాల త్యాగ ఫలితమే అని అన్నారు.
_”ఇది BJP కార్యక్రమం కాదు. ఇది 140 కోట్ల భారతీయుల కార్యక్రమం. కులం, మతం పక్కనపెట్టి ప్రతి ఇంటికి జెండా చేర్చే బాధ్యత మనదే. విద్యార్థులు చదువుతో పాటు దేశాన్ని కూడా ప్రేమించాలి. సరిహద్దులో మన సైనికులు మన కోసం కాపలా కాస్తున్నారు. వారికి రుణం తీర్చుకోవడానికి ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేద్దాం – దేశభక్తిని చాటుదాం”_ అని పిలుపునిచ్చారు.
_”నర్సంపేట నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1 గా నిలవాలని”_ ఆకాంక్షించారు.
ఆగస్టు 13 నుండి 15 వరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై గర్వంగా జాతీయ జెండా ఎగరవేసి ఫోటో తీసి #HarGharTiranga అని సోషల్ మీడియాలో పెట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులు, BJP నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు


