రాజన్న సిరిసిల్ల ఆగస్టు 6 ( పున్నమి ప్రతినిధి)
ముస్తాబాద్లో గ్రామపంచాయతీ రంగుల వివాదంపై BRS రాష్ట్ర నాయకుడు మెంగని మనోహర్ స్పందించారు. రంగులతో పోటీ కాకుండా అభివృద్ధిలో పోటీ పడాలని కాంగ్రెస్, బీజేపీకి సూచించారు. BRS హయాంలో కేటీఆర్ సహకారంతో ఆదర్శ గ్రామపంచాయతీ, డబుల్ రోడ్లు, సెంటర్ లైటింగ్, రైతు వేదిక, సబ్స్టేషన్, పాఠశాల భవనాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వంటి అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం కనీస నిర్వహణలోనూ విఫలమైందని, ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.


