ఖమ్మం ఆగష్టు
(పున్నమి న్యూస్ )
ఖమ్మం: సూర్యాపేట–దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి ప్రారంభం సందర్భంగా ఖమ్మం జిల్లా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మంద సరస్వతి నేతృత్వం వహించారు. బీజేపీ జిల్లా కార్యదర్శి రామనేని మణి, నాయకురాలు నాగమణితో పాటు మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే కీలక మౌలిక సదుపాయమని వారు పేర్కొన్నారు.



