నందలూరు స్వామినాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు ఆలయ టిటిడి అధికార లాంచనాలతో ఘనంగా సమర్పించి కల్యాణానికి హాజరయ్యారు..
మంగళవారం నాడు నందలూరు లో గల సౌమ్యనాథస్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం స్వామివారి కల్యాణాన్ని *మేడా విజయ శేఖర్ రెడ్డి* గారు తిలకించారు.
ఈ సందర్భంగా *మేడా* మాట్లాడుతూ సౌమ్యనాథాలయం ఎంతో పురాతనమైనదని,దక్షిణ భారతదేశంలోనే సుప్రసిద్ధ ఆలయంగా పేరుగాచిందని *మేడా విజయ శేఖర్ రెడ్డి* తెలియజేశారు.
అంతకుముందు ఆలయ అర్చకులు *విజయ శేఖర్ రెడ్డి* గారికి వేదమంత్రాలు మధ్య ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం *విజయ శేఖర్ రెడ్డి గారు* మాట్లాడుతూ ఈ సౌమ్యనాథ స్వామి వెలసి ఉన్న ప్రాంతంలో ఆయన జన్మించడం సౌమ్యనాథ స్వామి ఆలయ ప్రాంతానికి ఆయన స్థానికుడు కావడం ఆయన ఎంతో పుణ్యం చేసుకున్నారని భావించారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు నందలూరు/ రాజంపేట చెందిన పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






