పున్నమి ప్రతినిధి, పెనుమూరు మండలం
పాల్యం గ్రామం మరియు పరిసర గ్రామాల ప్రజల సహకారంతో, జూలై 29, 2026 (బుధవారం) న పాల్యం కొండ (పాల్యం గ్రామం), పెనుమూరు మండలం, చిత్తూరు జిల్లాలో గురు పౌర్ణమి మహోత్సవాలను ఘనంగా నిర్వహించనుంది.
ఈ సందర్భంగా ధర్మ జ్యోతి ప్రజ్వలన, గోపూజ, రుద్రాభిషేకం, సిద్ధ మంగళ స్తోత్ర పారాయణం, భజన కార్యక్రమాలు మరియు మహా అన్నసంతర్పణ నిర్వహించబడనున్నాయి. గురు పౌర్ణమి యొక్క ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజలకు చేరవేస్తూ, సనాతన ధర్మ పరిరక్షణ, గోమాత సంరక్షణ, ప్రకృతి పరిరక్షణ, దేశ శాంతి మరియు సమస్త జీవరాశుల సంక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ తెలిపారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులు, గోభక్తులు మరియు ధర్మాభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని గురువుల ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు కోరారు.
నిర్వాహకులు:
ఏకవీర సేవా ఫౌండేషన్
పాల్యం గ్రామం మరియు పరిసర గ్రామాల ప్రజల సహకారంతో


