ఖమ్మం మే
(పున్నమి జిల్లా ప్రతి నిధి)
ఖమ్మం నగరంలోని 3వ పట్టణ పరిధి 30వ డివిజన్లో ప్రమాదవశాత్తు గ్యాస్ లీకేజీ జరిగి గాయపడిన బీజేపీ మూడవ పట్టణ ఉపాధ్యక్షుడు కాలేరు సతీష్ కుటుంబాన్ని పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు బుధవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
కాలేరు సతీష్ కుటుంబం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ బీజేపీ శాసన సభ అభ్యర్థి నున్న రవికుమార్, శ్రీమతి మణి, కొణతం లక్ష్మి నారాయణ, దార్ల శంకర్ గౌడ్ ఈదుల వీర భద్రం లతో పాటుగా స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.



