ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షుడిగా లెక్కమనేని రాజేష్ నాయుడు ఎన్నికయ్యారు. నెల్లూరులో ఆదివారం నిర్వహించిన జిల్లా మహాసభల్లో వ్యవస్థాపక అధ్యక్షుడు డిల్లిబాబు రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ, ఐక్యత, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానన్నారు.

పాత్రికేయుల సంక్షేమమే లక్ష్యం: లెక్కమనేని రాజేష్ నాయుడు
ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఉదయగిరి నియోజకవర్గ అధ్యక్షుడిగా లెక్కమనేని రాజేష్ నాయుడు ఎన్నికయ్యారు. నెల్లూరులో ఆదివారం నిర్వహించిన జిల్లా మహాసభల్లో వ్యవస్థాపక అధ్యక్షుడు డిల్లిబాబు రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాజేష్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ, ఐక్యత, సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తానన్నారు.

