రాయదుర్గం ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఆయాలు, శానిటేషన్ వర్కర్లకు కనీస వేతనం 26,000 అమలు చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్కువ జీతాలు చెల్లిస్తూ వారితో శ్రమ దోపిడీ చేయించుకుంటున్నారని విమర్శించారు. ఈనెల 31వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టిన ధర్నాలు జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలను విడుదల చేశారు.


