(పువ్వాడ నాగేంద్ర కుమార్
పున్నమి న్యూస్ జిల్లా రిపోర్టర్ )
ఖమ్మం/హైదరాబాద్:
డాక్టర్ ఉప్పల శారద తెలంగాణకు చెందిన ప్రముఖ సామాజిక సేవకురాలు, రాజకీయ నాయకురాలు, మహిళా సాధికారతకు కృషి చేస్తున్న ప్రముఖ వ్యక్తిత్వం. భద్రాచలం, ఖమ్మం జిల్లా మూలాలున్న ఆమె ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా సేవలందిస్తున్నారు.
వాణిజ్యశాఖలో బీకాం, కంప్యూటర్ అప్లికేషన్స్లో పీజీ డిప్లొమా (PGDCA), న్యాయశాస్త్రంలో ఎల్ఎల్బీ పూర్తి చేసిన ఆమె, సమాచార సాంకేతిక రంగంలో ఉన్నత విద్యను అభ్యసించారు. దివంగత భారత్ ఉప్పలతో వివాహం కాగా, అభిషేక్, అభిజీత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
కుటుంబ నేపథ్యం – సేవా వారసత్వం
స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ కె. శ్రీరామమూర్తి మనవరాలైన ఉప్పల శారద, మాజీ సర్పంచ్ శ్రీ కె.పి. రంగారావు కుమార్తె. ప్రజాసేవ, దేవాలయ అభివృద్ధి, సామాజిక సంక్షేమం కుటుంబ సంప్రదాయంగా కొనసాగుతూ రావడంతో ఆమె కూడా అదే బాటలో నడుస్తూ గత 25 ఏళ్లకు పైగా సమాజ సేవలో విశేష కృషి చేస్తున్నారు.
25 వేల మందికి పైగా మహిళలకు ఉచిత నైపుణ్య శిక్షణ
డీవీఆర్ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఉప్పల శారద వేలాది మంది ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, వసతి, భోజనం అందించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 35 శిక్షణ కేంద్రాల ద్వారా 86 బ్యాచ్లలో సుమారు 25 వేల మందికి పైగా మహిళలకు శిక్షణ అందించి, వారిలో అధిక శాతం మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు.
మహిళా సాధికారతకు విశేష కృషి
వాసవి స్వగృహ ఫుడ్స్, వనిత సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, రక్ష, వీఎస్ ఎడ్యుకేషనల్ సొసైటీ, వాసవి మహిళా సంఘం వంటి అనేక సంస్థలను స్థాపించి మహిళల స్వయం ఉపాధి, విద్య, సామాజిక సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తున్నారు.
కాంగ్రెస్ నుంచి బీజేపీ వరకు రాజకీయ ప్రయాణం
1993లో హైదరాబాద్ సిటీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఉప్పల శారద, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏఐసీసీ సభ్యురాలు, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఖజాంచిగా పలు కీలక పదవులు నిర్వహించారు.
2013లో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆమె, 2014 సాధారణ ఎన్నికల్లో పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మహిలా మోర్చా ఇన్చార్జిగా పనిచేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా కొనసాగుతున్నారు.
కేంద్ర స్థాయిలో కీలక బాధ్యత
డాక్టర్ ఉప్పల శారద ప్రస్తుతం కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ అడ్వైజరీ కమిటీ (ఈక్వల్ రెమ్యూనరేషన్ రూల్స్) సభ్యురాలిగా సేవలందిస్తున్నారు.
పలువురు జాతీయ నాయకులతో భేటీలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య, సోనియా గాంధీ, పురందేశ్వరి తదితర ప్రముఖ రాజకీయ, సామాజిక, సాంస్కృతిక ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసి వివిధ అంశాలపై చర్చించారు.
విశిష్ట పురస్కారాలు
సమాజ సేవ, మహిళా సాధికారత, విద్య, ఉపాధి రంగాల్లో చేసిన సేవలకు గాను ఆమెకు అనేక పురస్కారాలు లభించాయి. గ్లోబల్ పీస్ యూనివర్సిటీ (అమెరికా) నుండి గౌరవ డాక్టరేట్తో పాటు, బెస్ట్ సోషల్ వర్కర్, విశిష్ట వనిత, ఇందిరా గాంధీ నేషనల్ అవార్డు, బెస్ట్ వాసవి వనిత, కృషి మహిళా అవార్డు వంటి పలు జాతీయ, రాష్ట్ర స్థాయి గౌరవాలు అందుకున్నారు.
సేవే లక్ష్యంగా నిరంతర ప్రయాణం
సామాజిక సేవ, మహిళల ఆర్థిక సాధికారత, నైపుణ్యాభివృద్ధి, విద్య, ఉపాధి, రాజకీయాల్లో ప్రజాసేవ అనే లక్ష్యాలతో డాక్టర్ ఉప్పల శారద నాలుగు దశాబ్దాలుగా నిరంతరం సేవలందిస్తూ సమాజంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు.



