తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామ సెక్రెటరీగా పనిచేసిన బాలనాగుకు గ్రేడ్ 4 నుంచి గ్రేడ్ 3 కి ప్రమోషన్ వచ్చి రిలీవ్ అవుతున్న సందర్భంగా సత్తిబాబు మాట్లాడుతూ కాపవరం సెక్రెటరీ గా వచ్చినప్పటి నుండి నాగు ఎప్పుడూ అధికార దుర్వినియోగం చేయడం నేను ఎప్పుడూ చూడలేదని, పేద వారు సచివాలయానికి ఏదైనా పనిమీద వస్తే ఆపని అయ్యే వరకు దగ్గరుండి చేసేవారని,ఆయనకు ప్రమోషన్ వచ్చే వెళ్లడం మాకు సంతోషంగా ఉన్నప్పటికీ అటువంటి వ్యక్తి వెళ్లిపోవడం చాలా బాధగా ఉంది అని గ్రామంలో ఎంతో చిత్త శుద్దితో పనిచేసిన బాల నాగును సన్మానించడం మా అదృష్టం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొవ్వూరు మండల అధ్యక్షులు మరియు కాపవరం పి.ఏ.సి.ఎస్ ఛైర్మన్ సుంకర సత్తిబాబు.ఈ సన్మాన కార్యక్రమం లో సొసైటీ సెక్రటరీ నాగేశ్వరరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు


