ఘనంగా వైఎస్సార్ జన్మదిన వేడుకలు.
జులై 8 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు స్వర్ణ నరేందర్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం ఏన్కూర్ లో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సెంటర్ లో గల వైయస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,సొసైటీ అధ్యక్షులు శెట్టిపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదే వైయస్సార్ సీఎంగా పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలకు సేవ చేసిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. ఆయన హయంలోనే పల్లెలు, పట్టణాలు సస్సోమ్లంగా ఉన్నాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్.నాయకులు మేడ ధర్మారావు, భూక్య లాలు నాయక్,భూక్య చందులాల్, గాలిబ్ సాహెబ్, ముక్తి వెంకటేశ్వర్లు, మాలోత్ నరసింహారావు, పూర్ణకంటి మైసరావు, గుర్రం రవి, పఠాన్ మజీద్ ఖాన్, వాసిరెడ్డి నాగేశ్వరరావు, దానసరి నవీన్, చందమామ నరసింహారావు,ఆది నరసింహారావు, భూపతి వెంకటేష్, అజ్మీర సురేష్, పెద్దబాబు, నిమ్మల నరేందర్, షేక్ నన్నే ఖాన్, పంతగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు.


