డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఊబలంక గ్రామంలో మంగళవారం ఉదయం అన్నా మినిస్ట్రీస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మండల ప్రజాపరిషత్ ప్రాథమిక పాఠశాల కె ఎస్ టి ఏ నందు గల 49 మంది విద్యార్థులకు ఉచితంగా వ్రాత పుస్తకాలు చైర్మన్ పమ్మి సత్యనారాయణ అందజేశారు అంబేద్కర్ మహాశయుని ముఖచిత్రంతో గల నోటు పుస్తకాలు అందివ్వటం చాలా సంతోషదాయకమని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కోలాటి సత్యనారాయణ పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ పిల్లి ప్రభాకరరావు అడ్మినిస్ట్రేటర్ నేకూరి రాజేష్ కుమార్, హైకోర్టు న్యాయవాది ఐ.ఇ.కుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు ఇలా ప్రభుత్వ పాఠశాలలో ఉచితంగా రాత పుస్తకాలు పంపిణీ చేయడానికి పలువురు సంతోషం వ్యక్తపరిచి అభినందించారు.




