కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి చైర్పర్సన్గా రాయపాటి సుభాషిని, 15 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆర్అండ్బి గెస్ట్హౌస్ నుంచి ఏఎంసీ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్, అంబేద్కర్, జగజీవన్రామ్, మహాత్మా పూలే విగ్రహాలకు నివాళులర్పించారు. దళిత మహిళకు చైర్పర్సన్ అవకాశం కల్పించడాన్ని పలువురు అభినందించారు. ర్యాలీ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, నినాదాలతో పట్టణం సందడిగా మారింది.
ఏఎంసీ పాలకమండలి ప్రమాణంతో కందుకూరులో భారీ ర్యాలీ నిర్వహణ
కందుకూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకమండలి చైర్పర్సన్గా రాయపాటి సుభాషిని, 15 మంది డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఆర్అండ్బి గెస్ట్హౌస్ నుంచి ఏఎంసీ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్, అంబేద్కర్, జగజీవన్రామ్, మహాత్మా పూలే విగ్రహాలకు నివాళులర్పించారు. దళిత మహిళకు చైర్పర్సన్ అవకాశం కల్పించడాన్ని పలువురు అభినందించారు. ర్యాలీ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు, నినాదాలతో పట్టణం సందడిగా మారింది.

