Tuesday, 30 June 2026
  • Home  
  • హనుమంత వాహనంపై శ్రీ కోదండరాముడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి
- తిరుపతి

హనుమంత వాహనంపై శ్రీ కోదండరాముడి అలంకారంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి

పున్నమి ప్రతినిధి, వడమాల పేట మండలం రామనామ స్మరణల మధ్య భక్తులను కటాక్షించిన కలియుగ ప్రత్యక్ష దైవం అప్పలాయగుంట బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు హనుమంత వాహనంపై శ్రీ కోదండరామ అలంకారంలో దివ్యమంగళ విహారం చేస్తూ భక్తులకు అభయప్రదానమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ, శ్రీరామ నామస్మరణల మధ్య స్వామివారి దివ్యరూపాన్ని దర్శించుకుని పులకించిపోయారు. హనుమంతునిపై శ్రీ కోదండరాముని అలంకారంలో స్వామివారి దర్శనం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 గంటల వరకు పుణ్యాహవాచనం, వసంతోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి గజవాహనంపై దివ్య దర్శనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు గజవాహనంపై భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ————— టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

పున్నమి ప్రతినిధి, వడమాల పేట మండలం

రామనామ స్మరణల మధ్య భక్తులను కటాక్షించిన కలియుగ ప్రత్యక్ష దైవం

అప్పలాయగుంట బ్రహ్మోత్సవాల్లో ఆధ్యాత్మిక వైభవం

అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు హనుమంత వాహనంపై శ్రీ కోదండరామ అలంకారంలో దివ్యమంగళ విహారం చేస్తూ భక్తులకు అభయప్రదానమిచ్చారు.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహనసేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ, శ్రీరామ నామస్మరణల మధ్య స్వామివారి దివ్యరూపాన్ని దర్శించుకుని పులకించిపోయారు. హనుమంతునిపై శ్రీ కోదండరాముని అలంకారంలో స్వామివారి దర్శనం భక్తులకు అపూర్వ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

మధ్యాహ్నం 3.00 నుంచి 4.00 గంటల వరకు పుణ్యాహవాచనం, వసంతోత్సవం నిర్వహించనున్నారు.

రాత్రి గజవాహనంపై దివ్య దర్శనం

బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి 7 గంటలకు శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారు గజవాహనంపై భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఏఈవో శ్రీ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ వేణుగోపాల్, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
—————
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.