నెల్లూరు బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ బందోబస్తు పోలీసులకు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు.
ఏవైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి వచ్చే ఏడాదికి సరిచేస్తానని భరోసా ఇచ్చారు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు బందోబస్తుకు వచ్చిన పోలీస్ సిబ్బందికి ఏపీ వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో భోజన సదుపాయం కల్పించారు. ఆ ప్రాంతాన్ని ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ పరిశీలించారు. భోజనం ఎలా ఉందని పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని, వచ్చే ఏడాదికి వాటిని సరి చేస్తామని తెలిపారు. అడిగిన వెంటనే తమకు సహాయ సహకారాలు అందించినందుకు పోలీసు సిబ్బంది అబ్దుల్ అజీజ్ కు ధన్యవాదాలు తెలిపారు.


