నెల్లూరు జిల్లా పెంచలకోన క్షేత్రంలో శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి జన్మ నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి.
రాపూరు: ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన రాపూరు మండలంలోని పెంచలకొన క్షేత్రంలో వెలసియున్న శ్రీపెనుశీల లక్ష్మీ నరసింహస్వామి ఆదిలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం నందు స్వామి వార్ల జన్మ నక్షత్రం సందర్భంగా ఉదయం నాలుగు గంటలకు స్వామి వారికి అభిషేకం. తొమ్మిది గంటలకు శాంతిహోమం, అనంతరం శ్రీవార్లకు నిత్య కళ్యాణ మండపంలో కళ్యాణము, సాయంత్రం శ్రీవార్లకి బంగారు గరుడ వాహనం, ప్రధానార్చకులు, వేదపండితులు, గిరిజన వాయిధ్యాలు, మంగళ వాయిద్యాలు నడుమ దేవస్థానం కార్యనిర్వహణాధికారి పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి. ఆధ్వర్యంలోఅత్యంత వైభవంగా నిర్వహించి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా క్యూలైన్ ఏర్పాటు, మంచినీరు సరఫరా,అన్నదానం కార్యక్రమం దేవస్థానం ఈ. ఓ.పర్యవేక్షణలో నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


