నాగాలాండ్లోని 19 సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు లేఖ రాశారు. మూడు భాషల విధానాన్ని, ముఖ్యంగా సంస్కృతాన్ని తప్పనిసరిగా బోధించడం రాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా లేదని తెలిపారు. నాగాలాండ్లో 17కు పైగా ప్రధాన తెగలు, అనేక ఉపతెగలు ఉండటంతో ప్రతి సమాజానికి ప్రత్యేక భాష ఉందని వివరించారు. ఇంగ్లీష్నే పరస్పర సంభాషణ భాషగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త విధానం వల్ల విద్యార్థులు, పాఠశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సడలింపులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

నాగాలాండ్లో మూడు భాషల విధానం అమలు కష్టమే: పాఠశాలల లేఖ
నాగాలాండ్లోని 19 సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు లేఖ రాశారు. మూడు భాషల విధానాన్ని, ముఖ్యంగా సంస్కృతాన్ని తప్పనిసరిగా బోధించడం రాష్ట్ర పరిస్థితులకు అనుకూలంగా లేదని తెలిపారు. నాగాలాండ్లో 17కు పైగా ప్రధాన తెగలు, అనేక ఉపతెగలు ఉండటంతో ప్రతి సమాజానికి ప్రత్యేక భాష ఉందని వివరించారు. ఇంగ్లీష్నే పరస్పర సంభాషణ భాషగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. కొత్త విధానం వల్ల విద్యార్థులు, పాఠశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సడలింపులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.

