ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 19 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలో SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా, ఆపరేషన్ ఐసైట్ యూనివర్సల్ సహకారంతో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో సుమారు 15 మంది గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. కంటి సమస్యలను గుర్తించి తగిన వైద్య సలహాలు కూడా ఇచ్చారు. గ్రామీణ ప్రజలకు ఇలాంటి ఆరోగ్య సేవలు అందించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ ప్రతినిధులకు గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందించారు.

కుడితిపల్లిలో ఉచిత కంటి పరీక్షల శిబిరం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూన్ 19 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం కుడితిపల్లి గ్రామంలో SEIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ సంస్థ తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) కార్యక్రమంలో భాగంగా, ఆపరేషన్ ఐసైట్ యూనివర్సల్ సహకారంతో ఉచిత కంటి పరీక్షల శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో సుమారు 15 మంది గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. కంటి సమస్యలను గుర్తించి తగిన వైద్య సలహాలు కూడా ఇచ్చారు. గ్రామీణ ప్రజలకు ఇలాంటి ఆరోగ్య సేవలు అందించడం అభినందనీయమని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన సంస్థ ప్రతినిధులకు గ్రామస్తులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందించారు.

