పాఠశాలల్లో విద్యార్థులకు ఆకలి తీరుస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని ఏఐటీయూసీ తిరుపతి జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో ముఖ్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై పోరాటానికి సన్నద్ధం!
పాఠశాలల్లో విద్యార్థులకు ఆకలి తీరుస్తున్న మధ్యాహ్న భోజన కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం రాబోయే రోజుల్లో ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తామని ఏఐటీయూసీ తిరుపతి జిల్లా అధ్యక్షులు కామ్రేడ్ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఆధ్వర్యంలో ముఖ్య కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలల తరబడి పెండింగ్లో ఉన్న వేతనాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

