ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ విస్తృత పర్యటన
జులై 26 ఖమ్మం జిల్లా పున్నమి ప్రతినిధి గుగులోత్ భావుసింగ్ నాయక్
ఖమ్మం:
నగరంలో ఆదివారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అద్దంకి శివను పరామర్శించారు అనంతరం గాదె అనిల్ నివాసంలో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. నగరంలోని 56వ డివిజన్ వాసులు స్వరూపరాణి- ఖాసీం దంపతుల కుమార్తె మానస ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు అనంతరం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

