విశాఖపట్నం పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను ప్రకటించింది. బీచ్ టూరిజం, అడ్వెంచర్ స్పోర్ట్స్, క్రూయిజ్ టూరిజం రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించే చర్యలు చేపడుతోంది.
కొత్త పర్యాటక సదుపాయాలు అందుబాటులోకి వస్తే దేశీయ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగనున్నాయి.


