శ్రీ కాళహస్తి, మే 22, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 47వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపు మేరకు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాల రూపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజాక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సుధీర్ రెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సేవలో ఆయన ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయకుమార్ నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ కంటా రమేష్, వంకాయల సిద్దులయ్య, పాలపర్తి యశ్వంత్, పాశం మునిరాజా యాదవ్ తదితరులు పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

శ్రీకాళహస్తి ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా రోగులకు పండ్ల పంపిణీ
శ్రీ కాళహస్తి, మే 22, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 47వ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పిలుపు మేరకు ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాల రూపంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, ప్రజాక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సుధీర్ రెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సేవలో ఆయన ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయకుమార్ నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు, క్లస్టర్ ఇంచార్జ్ కంటా రమేష్, వంకాయల సిద్దులయ్య, పాలపర్తి యశ్వంత్, పాశం మునిరాజా యాదవ్ తదితరులు పాల్గొని రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

