అనకాపల్లి జిల్లా, మే 1 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. భర్త పెన్షన్ పొందుతూ ఉన్న కుటుంబంలో భర్త మరణించడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తగా, ఆ పెన్షన్ను భార్యకు బదిలీ చేసి ఆమెకు ఆర్థిక భరోసా కల్పించింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను, డిజిటల్ అసిస్టెంట్ నూకరాజు పాల్గొని బాధిత మహిళకు పెన్షన్ అందజేశారు. ప్రభుత్వ ఈ నిర్ణయంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, అర్హులందరికీ ఇలాంటి సహాయం అందాలని కోరుతున్నారు.

ఎన్టీఆర్ భరోసా పెన్షన్తో నిరుపేదలకు అండగా కూటమి ప్రభుత్వం…
అనకాపల్లి జిల్లా, మే 1 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా కూటమి ప్రభుత్వం మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. భర్త పెన్షన్ పొందుతూ ఉన్న కుటుంబంలో భర్త మరణించడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తగా, ఆ పెన్షన్ను భార్యకు బదిలీ చేసి ఆమెకు ఆర్థిక భరోసా కల్పించింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కాండ్రకోట చిరంజీవి, సర్పంచ్ కుమారుడు భజంత్రీల శ్రీను, డిజిటల్ అసిస్టెంట్ నూకరాజు పాల్గొని బాధిత మహిళకు పెన్షన్ అందజేశారు. ప్రభుత్వ ఈ నిర్ణయంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, అర్హులందరికీ ఇలాంటి సహాయం అందాలని కోరుతున్నారు.

