*హిందూ సమ్మేళనాలు… ఐక్యతకు చిహ్నాలు..*
*పున్నమి ప్రతినిధి:: మహబూబ్నగర్ జిల్లా:: తేదీ:: 30/0 4/ 2026*
*హిందువులంతా ఏకమవాలని అమాత్రేయ క్షేత్రం పీఠాధిపతి ఆదిత్య పరా శ్రీ స్వామి సూచించారు గురువారం జిల్లా కేంద్రంలోని శేషాద్రి నగర్ హిందూ సమ్మేళన ఉత్సవ కమిటీ మరియు శేషాద్రి గుట్ట, మహేశ్వరి కాలనీ, శేషాద్రి నగర్, బికే రెడ్డి కాలనీ, బి.ఎన్.రెడ్డి కాలనీ, సంయుక్తంగా నిర్వహించిన హిందూ సమ్మేళన కార్యక్రమం హిందూ బంధువులు దాదాపుగా 2000 మందికి పైగా,చిన్నారులు ,వృద్ధులు, హిందూ బంధువులంతా పాల్గొని విజయవంతం చేశారు. ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ఏదైనా అనుకోని సంఘటనలో సమాజంలో జరిగినట్లయితే ప్రతి ఒక్కరు హిందూ బంధువులు స్పందించి ఉడతా భక్తిగా సహాయ సహకారాలు అందించాలని అప్పుడే హిందువుల ఐక్యత కలకాలం ఉంటుందని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ప్రసన్న ఆనంద్, అంబుజా, శ్రీనివాస్ రెడ్డి, సాగర్, రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ఎం ఎన్ విజయకుమార్, కరుణాకర్ గౌడ్, శ్రీనివాస్, కంటేశ్వర్, సుధీర్, వెంకట కృష్ణయ్య, దేవేంద్రప్ప నరసింహారాజు ,వేణు, శివరామయ్య, ధనలక్ష్మి,విజయ, కవిత, లక్ష్మీ సాగర్, అంజలీదేవి ,సరస్వతి, జ్యోతి, చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు హిందూ బంధువులను ఆకట్టుకున్నాయి*


