ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 29 (మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి).మనుబోలు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ శివ రాకేష్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సమ్మర్ హాలిడేస్ సందర్భంగా ఊరికి వెళ్లే వారు ముందుగా పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ముందస్తుగా తెలియజేస్తే ఇళ్ల భద్రత కోసం గస్తీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. పిల్లలు చెరువులు, గుంటల వద్దకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన అన్నారు. ప్రజలు పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇళ్ల భద్రతకు ముందస్తు సమాచారం, పిల్లలపై జాగ్రత్తలు తప్పనిసరి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 29 (మల్లికార్జున రావ్ పున్నమి ప్రతినిధి).మనుబోలు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ శివ రాకేష్ ప్రజలకు కీలక సూచనలు చేశారు. సమ్మర్ హాలిడేస్ సందర్భంగా ఊరికి వెళ్లే వారు ముందుగా పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని కోరారు. ముందస్తుగా తెలియజేస్తే ఇళ్ల భద్రత కోసం గస్తీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెచ్చరించారు. పిల్లలు చెరువులు, గుంటల వద్దకు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని ఆయన అన్నారు. ప్రజలు పోలీసులతో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

