శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి సమీపంలోని ఊరంధూరులో ఎమ్మెల్యే నివాసంలో అమరావతి రాజధాని హోదా సందర్భంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. టీడీపీ మహిళా కార్యకర్తలు ముగ్గులు వేయడంతో పాటు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి అమరావతిపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. అమరావతి తిరిగి రాజధానిగా గుర్తింపు పొందడం రాష్ట్ర ప్రజలందరికీ ఆనందకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విజయాన్ని ప్రజల సమిష్టి సాధనగా అభివర్ణిస్తూ, అమరావతిని అత్యుత్తమ రాజధానిగా అభివృద్ధి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని, గతంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు బాధాకరమని పేర్కొన్నారు. ఆ సమయంలో రైతులకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. విజయోత్సవాల నేపథ్యంలో అమరావతి రైతులు శ్రీకాళహస్తిని సందర్శించగా, వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడంతో పాటు ఎమ్మెల్యే నివాసంలో ఆత్మీయ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలను సన్మానిస్తూ చీరలు అందజేశారు. ఈ వేడుకల్లో మహిళా కార్యకర్తలు సాంప్రదాయ ముగ్గులు, దీపాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

అమరావతి విజయోత్సవాలు- ఎమ్మెల్యే నివాసంలో పండుగ వాతావరణం
శ్రీకాళహస్తి, ఏప్రిల్ 07 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి సమీపంలోని ఊరంధూరులో ఎమ్మెల్యే నివాసంలో అమరావతి రాజధాని హోదా సందర్భంగా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. టీడీపీ మహిళా కార్యకర్తలు ముగ్గులు వేయడంతో పాటు దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి అమరావతిపై తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. అమరావతి తిరిగి రాజధానిగా గుర్తింపు పొందడం రాష్ట్ర ప్రజలందరికీ ఆనందకరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విజయాన్ని ప్రజల సమిష్టి సాధనగా అభివర్ణిస్తూ, అమరావతిని అత్యుత్తమ రాజధానిగా అభివృద్ధి చేయడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అమరావతి పరిరక్షణ కోసం రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని, గతంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు బాధాకరమని పేర్కొన్నారు. ఆ సమయంలో రైతులకు మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. విజయోత్సవాల నేపథ్యంలో అమరావతి రైతులు శ్రీకాళహస్తిని సందర్శించగా, వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడంతో పాటు ఎమ్మెల్యే నివాసంలో ఆత్మీయ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, మహిళలను సన్మానిస్తూ చీరలు అందజేశారు. ఈ వేడుకల్లో మహిళా కార్యకర్తలు సాంప్రదాయ ముగ్గులు, దీపాలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాష్ట్ర ప్రజల కలల రాజధాని అమరావతి అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.

