Thursday, 19 March 2026
  • Home  
  • బలిజ భవన నిర్మాణానికి బసవయ్యపాలెంలో విరాళాల వెల్లువ
- తిరుపతి

బలిజ భవన నిర్మాణానికి బసవయ్యపాలెంలో విరాళాల వెల్లువ

శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని తొట్టంబేడు మండలంలో బసవయ్యపాలెం గ్రామంలో బలిజ సమాజ ఐక్యతకు నిదర్శనంగా బలిజ భవన నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. సమాజ అభివృద్ధి, సామూహిక కార్యక్రమాలు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా భవనం నిర్మించాలని గ్రామస్తులు సంకల్పించారు. ఈ క్రమంలో గ్రామ యువత, పెద్దలు కలిసి చురుకుగా విరాళాలు సేకరిస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామ ప్రముఖులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన అనంతరం ఈ భవనం వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి సమిష్టి కృషి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోలా ఆనంద్, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు అంజూరు శ్రీనివాసులు, ముత్యాల పార్థసారథి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కడూరు కమల కుమార్, వేము కోదండ రామయ్య, వల్లం గోపి, వేము మునీంద్ర, కడూరు హరిగోపాల్, కడూరు నాగరాజు, కడూరు ఉదయ్ కుమార్, చొక్కాని నాదముని, చొక్కాని పోలయ్య, చొక్కాని రామూర్తి, కడూరు శామంత్ కుమార్, సూర బిందు కుమార్, సూర దేవేంద్ర కుమార్, నాగలాపురం గోవర్ధన్, చక్రాల మురళి, రవి రాయల్, చందు రాయల్, కడూరు రూపేష్ కుమార్, వేము గోవర్ధన్, వేము పట్టాభి, పేట జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని తొట్టంబేడు మండలంలో బసవయ్యపాలెం గ్రామంలో బలిజ సమాజ ఐక్యతకు నిదర్శనంగా బలిజ భవన నిర్మాణానికి విరాళాల సేకరణ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. సమాజ అభివృద్ధి, సామూహిక కార్యక్రమాలు, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా భవనం నిర్మించాలని గ్రామస్తులు సంకల్పించారు. ఈ క్రమంలో గ్రామ యువత, పెద్దలు కలిసి చురుకుగా విరాళాలు సేకరిస్తూ ముందుకు సాగుతున్నారు. గ్రామ ప్రముఖులు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందిస్తున్నారు. నిర్మాణం పూర్తయిన అనంతరం ఈ భవనం వివిధ సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇలాంటి సమిష్టి కృషి ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోలా ఆనంద్, మాజీ ధర్మకర్తల మండలి సభ్యులు అంజూరు శ్రీనివాసులు, ముత్యాల పార్థసారథి, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కడూరు కమల కుమార్, వేము కోదండ రామయ్య, వల్లం గోపి, వేము మునీంద్ర, కడూరు హరిగోపాల్, కడూరు నాగరాజు, కడూరు ఉదయ్ కుమార్, చొక్కాని నాదముని, చొక్కాని పోలయ్య, చొక్కాని రామూర్తి, కడూరు శామంత్ కుమార్, సూర బిందు కుమార్, సూర దేవేంద్ర కుమార్, నాగలాపురం గోవర్ధన్, చక్రాల మురళి, రవి రాయల్, చందు రాయల్, కడూరు రూపేష్ కుమార్, వేము గోవర్ధన్, వేము పట్టాభి, పేట జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.