శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులకు, మత పెద్దలకు బృందమ్మ స్వయంగా వడ్డించి ఆప్యాయంగా పలకరించడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆమె వినయం, స్నేహభావం విందు వాతావరణాన్ని మరింత సౌహార్దంగా మార్చాయి. ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ…రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని, ఉపవాస దీక్షలతో ముస్లిం సోదరులు చూపుతున్న భక్తి ఆదర్శప్రాయమని కొనియాడారు. ఇలాంటి పవిత్ర సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సేవలను ప్రశంసిస్తూ, ముస్లిం సమాజానికి అవసరమైన సదుపాయాల కల్పనలో ఆయన ముందుంటారని తెలిపారు. షాదీ మహల్ అభివృద్ధి, నమాజ్ కోసం విస్తృత స్థలం, భవిష్యత్తులో ఉర్దూ పాఠశాల వంటి కార్యక్రమాలు సమాజ సేవకు నిదర్శనమన్నారు. తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను సుధీర్ రెడ్డి కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదర సోదరీమణులు పాల్గొన్నారు.

రంజాన్ ఇఫ్తార్ విందు పాల్గొన్న ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాతృమూర్తి బృందమ్మ
శ్రీకాళహస్తి, మార్చి 19, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజికవర్గంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదర సోదరీమణులకు, మత పెద్దలకు బృందమ్మ స్వయంగా వడ్డించి ఆప్యాయంగా పలకరించడం కార్యక్రమానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. ఆమె వినయం, స్నేహభావం విందు వాతావరణాన్ని మరింత సౌహార్దంగా మార్చాయి. ఈ సందర్భంగా బృందమ్మ మాట్లాడుతూ…రంజాన్ మాసం అత్యంత పవిత్రమైనదని, ఉపవాస దీక్షలతో ముస్లిం సోదరులు చూపుతున్న భక్తి ఆదర్శప్రాయమని కొనియాడారు. ఇలాంటి పవిత్ర సమయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అలాగే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సేవలను ప్రశంసిస్తూ, ముస్లిం సమాజానికి అవసరమైన సదుపాయాల కల్పనలో ఆయన ముందుంటారని తెలిపారు. షాదీ మహల్ అభివృద్ధి, నమాజ్ కోసం విస్తృత స్థలం, భవిష్యత్తులో ఉర్దూ పాఠశాల వంటి కార్యక్రమాలు సమాజ సేవకు నిదర్శనమన్నారు. తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను సుధీర్ రెడ్డి కొనసాగిస్తున్నారని ప్రశంసించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో ముస్లిం సోదర సోదరీమణులు పాల్గొన్నారు.

