Monday, 16 March 2026
  • Home  
  • ఎర్పేడు, మేర్లపాకలో అస్తవ్యస్తంగా రేషన్ పంపిణీ –నిరాశతో వెనుతిరుగుతున్న లబ్ధిదారులు
- తిరుపతి

ఎర్పేడు, మేర్లపాకలో అస్తవ్యస్తంగా రేషన్ పంపిణీ –నిరాశతో వెనుతిరుగుతున్న లబ్ధిదారులు

ఏర్పేడు, మార్చి 16 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండల పరిధిలోని మేర్లపాక గ్రామాల్లో నిరుపేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు తమ సమస్యలను బయటపెట్టేందుకు రోడ్డెక్కుతున్నారు. సాధారణంగా ప్రతి నెలా 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ జరగాల్సి ఉండగా, కేవలం రెండు మూడు రోజుల్లోనే ‘స్టాక్ అయిపోయింది’ అంటూ డీలర్లు చేతులెత్తేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో రేషన్ కోసం వచ్చిన వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రత మధ్య క్యూలలో వేచి ఉండలేక కొందరు స్పృహ తప్పి పడిపోయి ఆస్పత్రి పాలైన సంఘటనలు కూడా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. 16వ తేదీ వచ్చినా బియ్యం పంపిణీ జరగలేదని, అడిగితే సరైన సమాధానాలు ఇవ్వడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. రేషన్ కోసం ఆశగా వచ్చిన లబ్ధిదారులు చివరకు ఖాళీ సంచులతోనే వెనుతిరుగుతున్న దుస్థితి నెలకొంది. మా బియ్యం మాకు ఎందుకు సక్రమంగా ఇవ్వడం లేదంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మేర్లపాక గ్రామ ప్రజలు మాట్లాడుతూ, తమ గ్రామాల్లో రేషన్ బియ్యం సక్రమంగా అందేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేదల ఆకలితో చెలగాటం ఆడవద్దని, ఇప్పటికైనా యంత్రాంగం మేల్కొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.

ఏర్పేడు, మార్చి 16 (పున్నమి న్యూస్): ఏర్పేడు మండల పరిధిలోని మేర్లపాక గ్రామాల్లో నిరుపేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం పంపిణీ అస్తవ్యస్తంగా మారింది. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో గ్రామస్తులు తమ సమస్యలను బయటపెట్టేందుకు రోడ్డెక్కుతున్నారు. సాధారణంగా ప్రతి నెలా 5వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ బియ్యం పంపిణీ జరగాల్సి ఉండగా, కేవలం రెండు మూడు రోజుల్లోనే ‘స్టాక్ అయిపోయింది’ అంటూ డీలర్లు చేతులెత్తేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో రేషన్ కోసం వచ్చిన వృద్ధులు, వికలాంగులు గంటల తరబడి క్యూలైన్లలో నిలబడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎండ తీవ్రత మధ్య క్యూలలో వేచి ఉండలేక కొందరు స్పృహ తప్పి పడిపోయి ఆస్పత్రి పాలైన సంఘటనలు కూడా జరిగాయని స్థానికులు చెబుతున్నారు. 16వ తేదీ వచ్చినా బియ్యం పంపిణీ జరగలేదని, అడిగితే సరైన సమాధానాలు ఇవ్వడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. రేషన్ కోసం ఆశగా వచ్చిన లబ్ధిదారులు చివరకు ఖాళీ సంచులతోనే వెనుతిరుగుతున్న దుస్థితి నెలకొంది. మా బియ్యం మాకు ఎందుకు సక్రమంగా ఇవ్వడం లేదంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మేర్లపాక గ్రామ ప్రజలు మాట్లాడుతూ, తమ గ్రామాల్లో రేషన్ బియ్యం సక్రమంగా అందేలా అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుపేదల ఆకలితో చెలగాటం ఆడవద్దని, ఇప్పటికైనా యంత్రాంగం మేల్కొని ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వారు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.