Monday, 16 March 2026
  • Home  
  • దైవప్రార్థన తల్లిదండ్రుల ఆశీస్సులతో పరీక్షా కేంద్రాలకు చేరిన విద్యార్థులు
- తిరుపతి

దైవప్రార్థన తల్లిదండ్రుల ఆశీస్సులతో పరీక్షా కేంద్రాలకు చేరిన విద్యార్థులు

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షలు విజయవంతంగా రాయాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులు ముందుగా దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేసుకుని విద్యార్థులు తమ తల్లీ, తండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద అధికారులు విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించి లోనికి అనుమతించారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలు సజావుగా ప్రారంభమయ్యాయి.

శ్రీకాళహస్తి, మార్చి 16 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ఉదయం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. పరీక్షలు విజయవంతంగా రాయాలని ఆకాంక్షిస్తూ విద్యార్థులు ముందుగా దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేసుకుని విద్యార్థులు తమ తల్లీ, తండ్రుల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. కేంద్రాల వద్ద అధికారులు విద్యార్థుల హాల్ టికెట్లను పరిశీలించి లోనికి అనుమతించారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమైంది. పరీక్షల సందర్భంగా పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు కూడా భద్రతా ఏర్పాట్లు చేసి పరిస్థితిని పర్యవేక్షించారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలు సజావుగా ప్రారంభమయ్యాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.