జిల్లా వ్యాప్తంగా రాత్రి పూట జరుగుతున్న ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి డా. అజిత వేజెండ్ల, IPS గారి ఆదేశాల మేరకు పోలీసులు నిర్వహిస్తున్నారు. రాత్రి సమయంలో డ్రైవర్లలో నిద్ర మత్తు వల్ల జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. టోల్ ప్లాజాలు, ప్రధాన జంక్షన్లు వద్ద పోలీసులు వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి అప్రమత్తం చేస్తున్నారు. డ్రైవర్లు నిద్రగా అనిపిస్తే వాహనాన్ని పక్కన ఆపి విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తున్నారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయవద్దని హెచ్చరిస్తూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నారు. అనుమానాస్పద కార్యకలాపాలపై 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.



