(జయప్రతాప్ రెడ్డి నెల్లూరు బ్యూరో )
రోజు దగదర్తి మండల తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాలేపాటి లోకేష్ జన్మదినం సందర్భంగా నెల్లూరులోని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి నిరాశ్రయుల ఆశ్రమ కేంద్రంలో మాలేపాటి లోకేష్ చేతుల మీదుగా అక్కడ ఉన్న 50 మంది నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా రాత్రి భోజనం ఏర్పాట్లుచేసి వారందరికీ దుప్పట్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారందరూ మాలేపాటి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. కలకాలం సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాలేపాటి లోకేష్ గారివెంట ఆయన మిత్రులు, శ్రేయోభిలాషులు ఉన్నారు. తండ్రి సుబ్బానాయుడు విషాదం జరిగి కొద్ది నెలలే కావడం తో జన్మదినం గురించి గోప్యంగా ఉంచారు. అయినా అభిమానులు భారీగా తరలివచ్చారు.


