పున్నమి ప్రతినిధి రామచంద్రాపురం మండలం
రామచంద్రాపురం మండలం నడవలూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో, ఆర్సిపురం సెక్టార్, చంద్రగిరి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ శ్రీమతి కే. మనీల అధ్యక్షతన
“బాల్య వివాహ్ ముక్త భారత్” కార్యక్రమంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు
ఈ సందర్భంగా ఆమె పలు అంశాలపై మాట్లాడుతూ ముఖ్యంగాబాల్య వివాహాలు నివారించడం,పిల్లల అక్రమ రవాణా నిరోధం,పిల్లలపై లైంగిక వేధింపుల నివారణ మరియువ్యక్తిగత పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి క్షుణ్ణంగా తెలియపరిచారు.అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బేటీ బచావో- బేటీ పడావో” పథకం వివరాలు వివరించారు. ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకు
పోక్సో చట్టం గురించి ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. సామాజిక బాధ్యతలపై ప్రతి ఒక్కరు అపరముత్తంగా ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే .దుర్వాసులు , ఉపాధ్యాయులు, జగన్నాథం వాసుదేవ రెడ్డి, విశాలాక్షి , కవిత ,మిడ్ డే మీల్ హెల్పర్ వరలక్ష్మి అంగన్వాడీ కార్యకర్తలు బి .అనూష కే హారిక ,పాఠశాల బాలబాలికలు పాల్గొన్నారు.


