Thursday, 5 February 2026
  • Home  
  • శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో చైర్మన్ చింతల శంకర్ ప్రమాణస్వీకారం
- కామారెడ్డి

శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో చైర్మన్ చింతల శంకర్ ప్రమాణస్వీకారం

శనివారం.. దక్షిణ కాశీ ప్రాముఖ్యత, అభివృద్ధి ప్రణాళికలు కామారెడ్డి, 9 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లోని రామారెడ్డి-ఇసన్నపల్లి శివారులో వెలసిన పవిత్ర ధామం శ్రీ కాలభైరవ స్వామి ఆలయ సన్నిధిలో శనివారం (జనవరి 10) చైర్మన్ చింతల శంకర్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరుగనుంది. ఎమ్మెల్యే కె. మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి పలువురు వీఐపీలు పాల్గొంటారు. ఆలయ చైర్మన్ చింతల శంకర్ మాట్లాడుతూ, ఈ మహోత్సవం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తుందని తెలిపారు. ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత ఈ ఆలయం క్రీశ 16వ శతా బ్దంలో కాశీ నుంచి స్వామివారి స్వయంభు విగ్రహా న్ని ఎద్దు బండిపై తీసుకొస్తున్నప్పుడు ఇక్కడే భారీ శబ్దంతో బండి విరిగి, 14 అడుగుల ఎత్తు విగ్రహం నిటారుగా నిలబడింది. దాంతో ఈ ప్రదేశాన్నే స్వామి కోరిక మేరకు ఆలయంగా ప్రసిద్ధిగాంచిం దన్నారు.కాశీ తర్వాత దక్షిణ భారతదేశంలోనే ఏకైక కాలభైరవ క్షేత్రం ఇది. గ్రహదోషాలు, అపమృ త్యు దోషాలు, దుష్టశాంతి నివారణకు ఇక్కడ పూజలు చేస్తే సకల సుఖాలు కలుగుతాయని చైర్మన్ చింతల శంకర్ ప్రాధాన్యత చెప్పారు. కార్తిక బహుళాష్టమి జయంతి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తండోపాతండాలుగా తరలి వచ్చి దర్శనం పొందుతారని గుర్తు చేశారు. అభివృ ద్ధి ప్రణాళికలు ఇకపై ఆలయాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చుతాము. నిధులు రాక పోయినా దాతలు, భక్తుల సహకారంతో గోపురాలు నిర్మించాం, ఇకమీదట మహిళలకు వసతి గృహా లు, ప్రసాద షెడ్‌లు, రహదారి అభివృద్ధి, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే మరింత వేగంగా పనులు పూర్తి చేస్తామని చైర్మన్ శంకర్ ఆత్మవి శ్వాసంగా ప్రకటించారు. ధర్మకర్తల మండలి సభ్యులు, డైరెక్టర్లతో కలిసి గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.స్థానికుల ఆకాంక్షలు స్థానిక గ్రామస్తులు ఈ అభివృద్ధి ప్రణాళికలకు స్వాగతం పలికుతామని హామి ఇచ్చారు. ఎమ్మెల్యే మదన్మో హన్ రావు మద్దతుతో ఆలయం మరింత ఆకర్షణీ యంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులు ప్రతి మంగళవారం ఘనంగా పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని చైర్మన్ ఆహ్వానిం చారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్లారెడ్డి ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

శనివారం.. దక్షిణ కాశీ ప్రాముఖ్యత, అభివృద్ధి ప్రణాళికలు

కామారెడ్డి, 9 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి జిల్లా, ఎల్లారెడ్డి సెగ్మెంట్‌లోని రామారెడ్డి-ఇసన్నపల్లి శివారులో వెలసిన పవిత్ర ధామం శ్రీ కాలభైరవ స్వామి ఆలయ సన్నిధిలో శనివారం (జనవరి 10) చైర్మన్ చింతల శంకర్ ప్రమాణ స్వీకారం ఘనంగా జరుగనుంది. ఎమ్మెల్యే కె. మదన్మోహన్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి పలువురు వీఐపీలు పాల్గొంటారు. ఆలయ చైర్మన్ చింతల శంకర్ మాట్లాడుతూ, ఈ మహోత్సవం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి కొత్త ఆవిష్కరణలు తీసుకొస్తుందని తెలిపారు. ఆలయ చరిత్ర, ప్రాముఖ్యత ఈ ఆలయం క్రీశ 16వ శతా బ్దంలో కాశీ నుంచి స్వామివారి స్వయంభు విగ్రహా న్ని ఎద్దు బండిపై తీసుకొస్తున్నప్పుడు ఇక్కడే భారీ శబ్దంతో బండి విరిగి, 14 అడుగుల ఎత్తు విగ్రహం నిటారుగా నిలబడింది. దాంతో ఈ ప్రదేశాన్నే స్వామి కోరిక మేరకు ఆలయంగా ప్రసిద్ధిగాంచిం దన్నారు.కాశీ తర్వాత దక్షిణ భారతదేశంలోనే ఏకైక కాలభైరవ క్షేత్రం ఇది. గ్రహదోషాలు, అపమృ త్యు దోషాలు, దుష్టశాంతి నివారణకు ఇక్కడ పూజలు చేస్తే సకల సుఖాలు కలుగుతాయని చైర్మన్ చింతల శంకర్ ప్రాధాన్యత చెప్పారు. కార్తిక బహుళాష్టమి జయంతి ఉత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తండోపాతండాలుగా తరలి వచ్చి దర్శనం పొందుతారని గుర్తు చేశారు. అభివృ ద్ధి ప్రణాళికలు ఇకపై ఆలయాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చుతాము. నిధులు రాక పోయినా దాతలు, భక్తుల సహకారంతో గోపురాలు నిర్మించాం, ఇకమీదట మహిళలకు వసతి గృహా లు, ప్రసాద షెడ్‌లు, రహదారి అభివృద్ధి, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి నిధులు వస్తే మరింత వేగంగా పనులు పూర్తి చేస్తామని చైర్మన్ శంకర్ ఆత్మవి శ్వాసంగా ప్రకటించారు. ధర్మకర్తల మండలి సభ్యులు, డైరెక్టర్లతో కలిసి గ్రామీణాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు.స్థానికుల ఆకాంక్షలు స్థానిక గ్రామస్తులు ఈ అభివృద్ధి ప్రణాళికలకు స్వాగతం పలికుతామని హామి ఇచ్చారు. ఎమ్మెల్యే మదన్మో హన్ రావు మద్దతుతో ఆలయం మరింత ఆకర్షణీ యంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులు ప్రతి మంగళవారం ఘనంగా పాల్గొని స్వామి అనుగ్రహం పొందాలని చైర్మన్ ఆహ్వానిం చారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎల్లారెడ్డి ప్రజలు భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.