గూడూరు మండలం, లేళ్ళగరువు గ్రామంలోపల్లెపండుగ 2.0 లో భాగంగా 75లక్షల రూపాయల MGNREGS నిధులతో లేళ్ళగరువు గ్రామం నుండి షాబ్ధుల్లపాలెం రోడ్డు వరకు తారు రోడ్డు నిర్మాణము మరియు ఆకులమన్నాడు గ్రామంలో 15th ఫైనాన్స్ కమిషన్ 36 లక్షల రూపాయల నిధులతో విలేజ్ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ శంఖుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్న పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు బలోపేతం కావడం ద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం, పారిశుధ్య అభివృద్ధి సాధ్యమవుతుందని,పల్లెల అభివృద్ధే లక్ష్యంగా, ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పెడన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, NDA కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.


