యస్.కె.ఆర్. ప్రభుత్వ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విక్రమ సింహపురి యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ మెన్ క్రికెట్ టోర్నమెంట్ జనవరి 5, 6 తేదీలలో జరగనున్న సందర్భంగా సోమవారం ఉదయం 10 గంటలకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి టోర్నమెంట్ను ప్రారంభించారు. ఈ పోటీ లో ఎస్ వి ఆర్ట్స్ కాలేజీ గూడూరు, ఎస్ కే ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, సూళ్లూరుపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, శ్రీ శ్రీనివాస కాలేజీ గూడూరు తలపడనున్నాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ క్రీడలు శారీరక సామర్థ్యం తో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, ఎస్ కే ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ పి. నారాయణరాజు క్రీడా రంగానికి చేస్తున్న సేవలు ప్రశంసింపదగినవని, విద్యార్థిని విద్యార్థులు తమ విద్య కోర్సులతో పాటు క్రమశిక్షణతో క్రీడల్లో కూడా రాణించి ప్రతిభావంతులు కావాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, యూనివర్సిటీ తరపున వచ్చిన అబ్జర్వర్ ఎం. రవీంద్ర బాబు, సూళ్లూరుపేట గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ శ్రీమతి అమ్మాజీ, అధ్యాపకులు డాక్టర్ కే. శివ ప్రసాద్, డాక్టర్ గోవిందు సురేంద్ర, శ్రీధర్ శర్మ, డాక్టర్ ఝాన్సీ వాణి, కృపా కరుణ వాణి, డాక్టర్ కె. కోటేశ్వరరావు, కిరణ్మయి, డాక్టర్ విజయ మహేష్, డాక్టర్ పీర్ కుమార్, కె. రవి రాజు, లక్ష్మీ హిమబిందు, తదితర అధ్యాపక సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.



