కర్నూలు పున్నమి ప్రతినిధి
*కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వీల్ చైర్ మరియు ఎయిర్ బెడ్ విరాళం*
*ఆసుపత్రి అడిషనల్ డిఎంఈ & సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ :-* కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో శ్రీ M. రమేశ్ గారి తల్లి అయిన రంగమ్మ చికిత్స పొందుతూ మృతి చెందారు. వారి జ్ఞాపకార్థంగా ఆసుపత్రికి వీల్ చైర్ మరియు ఎయిర్ బెడ్ విరాళంగా అందజేశారు.
సామాజిక సేవా దృక్పథంతో ఆసుపత్రికి ఈ పరికరాలు అందజేయడం పట్ల మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము అని అన్నారు.
ఈ విరాళంగా అందిన పరికరాలను ఎమర్జెన్సీ విభాగాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జి సిఎస్ఆర్ఎంఓ, డా.వెంకటరమణ, శ్రీ M.రమేశ్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


